Modi Diwali Gift : నిరుద్యోగులకు ఇదో పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు. దీపావళి కానుకగా 75వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియాపక పత్రాలను అందజేయనున్నారు ప్రధాని మోది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని రాహుల్ గాంధీతో సహా విపక్షాలన్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. విమర్శకులు సరైన విధంగా కౌంటర్ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. రానున్న మరికొన్ని వారాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. దీపావళి పండగ రోజున.. 75వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వనున్నారు ప్రధాని మోది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులందరితో సహా, ఎంపీలందూ వారి వారి నియోజకవర్గాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు.