Army Rally : అగ్నివీర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నూతన ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఆర్మీ ర్యాలీలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ (AOC) సెంటర్లో ఈ ఆర్మీ ర్యాలీ ఈ నెల అక్టోబర్ 29 నుంచి జనవరి 15 వరకు జరుగనుంది. అభ్యర్ధులు ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనేందుకు రెడీగా ఉండాలని AOC కేంద్ర పేర్కొంది. ఏవోసీ ట్రాక్లోనే ఈ ర్యాలీ జరుగనున్నట్లు వారు ప్రకటించారు.
ఈ ర్యాలీలో అగ్నివిర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ (AE) విధులకు ఎంపిక జరుగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉన్నవారు ముందుగానే పేరు నమోదు చేసుకోవాలని ఏవోసీ కేంద్రం సూచించింది.
వయోపరిమితి : ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనాలనుకునే అభ్యర్ధుల వయసు 17 సంవత్సరాలు 6 నెలల నుంచి 23 సంవత్సరాలకు మించరాదు. ఆర్మీ అభ్యర్ధులు కేంద్ర ప్రభుత్వాన్ని వయసు సడలింపు కోరడంతో 21 నుంచి 23 వరకు అభ్యర్ధుల వయోపరిమితిని పెంచింది. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ను https://joinindianarmy.nic.in/ విసిట్ చేయండి.