EPAPER

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తాజాగా దొరికిన ఆధారాలపై ప్రశ్నించేందుకు మనీశ్ సిసోడియాకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.


కాగా, ఈ కేసులో సిసోడియాను గతేడాది అక్టోబర్‌లో సీబీఐ విచారించింది. దాదాపు తొమ్మిది గంటలపాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌తో పాటు అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రులపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఇక సీబీఐ నోటీసులు పంపించడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు మరోసారి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గతంలో కూడా తన ఇంట్లో, బ్యాంక్ లాకర్‌నూ తనిఖీ చేసినప్పటికీ.. వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలని తాను ప్రయత్నిస్తుంటే.. కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.


Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×