Mallika sagar: మొట్టమొదటిసారి మహిళా ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఇందుకు సంబంధించి ముంబైలో మహిళా క్రికెటర్ల వేలం కూడా జరిగింది. ఈ వేలంలో క్రికెటర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడగా.. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందనాను ఊహించని రీతిలో రూ.3.4 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వేలం నిర్వహించిన మల్లికా సాగర్ పేరు మారుమ్రోగుతోంది. ఆమె వేలం నిర్వహించిన తీరును పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. ఇక ముంబైకి చెందిన 48 ఏళ్ల మల్లికా సాగర్ మొట్టమొదటిసారి క్రిస్టీన్ ఆక్షన్ హౌస్లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001 న్యూయార్క్లో మోడ్రన్ ఇండియన్ ఆర్ట్ వేలం నిర్వహించారు. ప్రస్తుతం ముంబైలో ఉంటూ పలు వేలం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక స్ట్పోర్స్ విభాగంలో 2021లో మొట్టమొదటిసారి ప్రొ కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియను నిర్వహించారు. క్రికెట్కు సంబంధించిన వేలాన్ని నిర్వహించడం మల్లికకు ఇదే మొదటిసారి. అయితే వేలం నిర్వహించడానికి ముందు హ్యూగ్ ఎడ్మడెస్ వీడియోలు చూసి తాను ఎంతో నేర్చుకున్నానని మల్లికా తెలిపారు.