Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నాగచైతన్యతో విడిపోయాక పూర్తిగా సినిమాలు, కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో అనుకోకుండా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. దాదాపు 8 నెలలుగా ఆ వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది.
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. హాట్ సమ్మర్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు కానుంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ మూవీలో సామ్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ 60శాతం కంప్లీట్ అయింది.
తాజాగా సామ్ తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొండ కింది నుంచి ఆలయం వరకు సుమారు 600 మెట్లకు హారతి వెలిగించి మొక్కులు తీర్చుకుంది. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే తన ఆరోగ్యం కోలుకోవడంతో సామ్ ఇలా మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.