China : 2020 భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో చైనాకు భారత్కు మధ్య భీకరమైన ఘర్షన జిరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటి ఘర్షణలో అక్కడున్న చైనీస్ ఆర్మీ కమాండర్ క్వి ఫబావోను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నతంగా సత్కరించారు. భారత్ ఆర్మీని చైనా సేనలు దొంగదెబ్బ తీయడానికి ప్రధాన కారణం కూడా ఈ కామండరే కారణం. చైనాలో అత్యంత ప్రముఖులకు మాత్రమే చోటు ఉన్న కాంగ్రెస్ సమావేశాలకు కమాండర్ క్వి ఫబావోను ఆహ్వానించి మర్యాదలు చేశారు.
భారత్ చైనా సరిహద్దులో ఇరువైపుల నుంచి సైనికులు ఆయుధాలను ధరించకూడదు. కానీ చైనా సైనికులు ఆ నిబంధనలను అతిక్రమించి ఇనుప రాడ్లకు ఇనుప కంచెలను చుట్టు భారత సైనికులపై దాడికి దిగారు. చైనా లిబరేషన్ ఆర్మీ రెచ్చగొట్టడం వల్లే భారతీయ సేనలు కూడా ప్రతి దాడికి దిగాయి. ఈ చిన్న యుద్ధంలో 20 మంది భారత సైనికులు ప్రణాలు కోల్పోయారు. అటు చైనా సైనికులు మరింత సంఖ్యలో చనిపోయారు. భారత సేనలు వారికప్పుడు ధీటుగా సమాధానం చెప్పినా చైనా దీన్ని బయటకు రాకుండా చాకచక్యంగా వ్యవహరించింది. మొత్తం మృతి చెందిన చైనా సైనికుల సంఖ్యను బయట పెట్టలేదు.