ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో.. అమెరికా, చైనా నువ్వా? నేనా? అని పోటీపడుతూ ఉన్నారు. సొంతంగా పరికరాలు తయారు చేసుకుంటూ.. ఇతర దేశాలు చేయని పరిశోధనలను చేస్తూ.. టాప్ 1కు చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. చైనాకంటే తామే ముందుగా ఉండాలని అమెరికా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా చైనాపై అమెరికా మరింత నిఘా పెంచింది.
తాజాగా చైనాకు చెందిన స్పై బెలూన్.. అమెరికా వైపుకు ఎగురుకుంటూ వచ్చింది. అది స్పై బెలూన్ అని అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అయినా కూడా అమెరికా ప్రభుత్వం వారికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే బీజింగ్కు చెందిన ఆరు ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్ను యూఎస్ బ్లాక్లిస్ట్లో పెట్టింది. ఇకపై ఆ ప్రోగ్రామ్స్కు, అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.
బీజింగ్కు చెందిన ఆరు ఏరోస్పేస్ కంపెనీలు, ఒక రీసెర్చ్ సెంటర్.. అమెరికా నుండి దిగుమతి అయ్యే టెక్నాలజీ మీదే ఆధారపడతాయి. తాజాగా ఆ దైశంపై చైనా స్పై చేయాలని ప్రయత్నించడంతో ఇకపై బీజింగ్ ఏరోస్పేస్కు టెక్నాలజీ అందడం కష్టమవ్వాలని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన అధికారికంగా సంతకాలు కూడా చేసినట్టుగా సమాచారం.
ఇప్పటివరకు చైనాకు, అమెరికాకు పోటీ ఉన్నా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కానీ ఒక్క స్పై బెలూన్ ఇదంతా తారుమారు చేసేసింది. అందుకే ఎయిర్షిప్స్, బెలూన్స్ తయారు చేసే బీజింగ్ కంపెనీలకు అమెరికా ఇకపై సపోర్ట్ చేయకూడదని నిర్ణయించుకుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఏ మాత్రం ఎఫెక్ట్ చేయలేదని తెలుస్తోంది. వారు ఎంతగా నెగిటివిటీ చూపించినా.. తయారీ ఆగదని చైనా గట్టి సమాధానమే ఇచ్చింది. కానీ బీజింగ్ ఏరోస్పేస్ మాత్రం దీనిపై స్పందించడానికి సిద్ధంగా లేదు.