Lake: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరస్సుల్లో ఒకటి లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు. సముద్రమట్టానికి 13,862 అడుగుల ఎత్తులో 70 చదరపు కిలోమీటర్లు ఈ సరస్సు విస్తరించి ఉంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.
అయితే గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ పోటీ జరగనుంది. భారత్లో మొట్టమొదటిసారి ఇటువంటి పోటీని నిర్వహిస్తున్నారు. 21 కిలోమీటర్ల ఈ మారథాన్ పరుగు లుకుంగ్ నుంచి ప్రారంభమై మాన్ గ్రామం వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో 50 మంది విదేశీ అథ్లెట్లు, 25 మంది స్వదేశీ అథ్లెట్లు మొత్తం 75 మంది పాల్గొననున్నారు. వారికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించినాకే పోటీలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదుకానున్న ఈ మారథాన్కు లాస్ట్ రన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కార్యక్రమం నిర్వహణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు ఈ మారథాన్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.