Thamilisai : బాడీ షేమింగ్ చేసేవాళ్లకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన రంగుపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే తాను అగ్నికణంగా మారతానని గవర్నర్ తమిళిసై అన్నారు.
చెన్నైలోని తండయార్పేట బాలికల ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై..తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తన రంగు నలుపని…నుదురు బట్టతలలా ఉంటుందని కొందరు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉన్నానని మరోసారి తనను విమర్శిస్తే అగ్గిలా మారతానని గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.