Marriage : ఆ యువతి విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంది. తన వివాహం చేసుకోవాల్సిన రోజే ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. దీంతో నవ వధువుగా ముస్తాబై వెళ్లి మరీ పరీక్ష రాసింది. ఇప్పుడు ఆ వధువు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేరళకు చెందిన శ్రీలక్ష్మి అనిల్ బేథనీ నవజీవన్ కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతోంది. ఇంతలో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. సరిగ్గా పెళ్లి రోజు ఓ ఎగ్జామ్ వచ్చి పడింది. దీంతో పెళ్లి కూతురుగా ముస్తాబై కళాశాలకు వెళ్లింది. ఉత్సాహంగా వెళ్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసింది.
ఆ యువతి కుటుంబ సభ్యులు, వరుడి కుటుంబం ఆమెను ప్రోత్సహించారు. పట్టుచీర ధరించి , ధగధగ మెరిసే నగలు వేసుకుని కళాశాలలో అడుగుపెట్టింది. ల్యాబ్ కోటు ధరించి పరీక్ష హాలులో వెళ్లింది. ప్రశాంతంగా పరీక్ష రాసింది. ఇప్పుడు ఆ వధువు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త పెళ్లికూతురుకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. చదువుకు పెళ్లి ఆటంకం కాదని ఈ యువతి నిరూపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలకు శ్రీలక్ష్మి స్ఫూర్తిగా నిలుస్తోందని అంటున్నారు. ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.