ముక్కంటి మల్లన్న అభిషేక ప్రియుడు. పూలు, ఫలాలు, పంచామృతం అవసరమే లేదు. కాసిన్ని నీటితో అభిషేకించినా మురిసిపోయి తమను అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. పాలతో శివుడ్ని అభిషేకిస్తే దు:ఖ నాశనం కలుగుతుంది. పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం, నెయ్యి చేస్తే గుణవంతులు, తేజోవంతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. చెరుకు రసంతో ఆనందం, కొబ్బరి నీళ్లుతోచేస్తే ధనవృద్ధి ప్రాప్తిస్తుంది.
Read More: మీనరాశిలో బుధుడు ఉదయం.. ఈ రాశుల వారికి లాభాలు..
భస్మజలం చేసే మహాపాపనాశనం కలుగుతుంది. అవిసనూనె, విప్పనూనె, నువ్వులనూనెతో శివుడ్ని అభిషేకిస్తే శత్రునాశనం జరుగుతుంది. బిల్వదశజలంతో భోగభాగ్యాలు, కలుగుతాయి. సువర్ణజలం-దారిద్ర్య నాశనం అవుతుందని నమ్మకం. ద్రాక్ష పండ్ల రసంతో ధనప్రాప్తి, ఖర్జూర జలంతో అభిషేకిస్తే సుఖజీవనం ఉంటుంది. కస్తూరి జలతో శివుడ్ని అభిషేకిస్తే శత్రుహాని నివారణ ఉటుంది.
శివపూజలో అన్నంతో లింగార్చన చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివ లింగం మొత్తం అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చన తర్వాత ప్రసాదముగా పంచుతారు. చూడటానికి ఎంతో బాగుంటుంది అన్న లింగార్చన . ఎన్ని అభిషేకాలు చేసిన భక్తితో చేస్తే పరమశివుడు కరుణించి అనుగ్రహిస్తాడు. ఏ అభిషేకం చేశామన్న సంగతి కన్నా ఎంత భక్తితో శివయ్యను కొలుస్తున్నామన్నదే అసలు విషయం.