E-race: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగిసింది. రేస్ కార్లలో రేసర్లు రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రేస్ గంటన్నర పాటు కొనసాగింది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్లో పొల్గొన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లి జీన్ ఎరిక్ ఈ రేసులో విజేతగా నిలిచారు. ఇక రెండో స్థానంలో నిక్ క్యాసిడో, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
విజేతలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, మంత్రి కేటీఆర్ ట్రోఫీలను అందజేశారు. ఈ రేసును చూడడానికి క్రికెటర్లు సచిన్, ధావన్, చాహల్.. సినీ నటులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యశ్ హస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. రేస్ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.