Rana Controversy : కొన్నాళ్లుగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో జరగుతున్న భూవివాద కేసుకి సంబంధించి నాంపల్లి కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, హీరో రానాలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. అసలు వివాదం ఏంటి? నాంపల్లి కోర్టు వారిపై ఎందుకు కేసు ఫైల్ చేయాలని ఆర్డర్స్ వేసిందనే వివరాలు కావాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సిందే. 2014లో ఫిల్మ్ నగర్లోని ప్లాట్ నెంబర్ 2లోని వెయ్యి గజాల స్థలాన్ని సురేష్ బాబు కొన్నారు. అయితే అంతకు ముందే పక్కనే ఉన్న ప్లాట్ నెంబర్ 3లో స్థలాన్ని ప్రమోద్ అనే వ్యాపారికి లీజుకి ఇచ్చారు.
2018లో లీజు ముగుస్తున్న సమయంలో సురేష్ బాబు తన వెయ్యి గజాల స్థలాన్ని అమ్మాలనుకుని రూ.18 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ప్రమోద్ రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అంతకు ముందే లీజు పరిమితి ముగిసినా స్థలం నుంచి ఖాళీ చేయటం లేదంటూ ప్రమోద్పై సురేష్ బాబు కేసు వేసి ఉన్నారు. అయితే అగ్రిమెంట్ ప్రకారం తనకు స్థలం అమ్మటం లేదని ప్రమోద్ కోర్టులో కేసు వేశారు. ఇలా ఈ స్థల వివాదంపై ఇప్పటికే ఐదు కేసులు నడుస్తుండగా హీరో రానాకు సురేష్ బాబు స్థలాన్ని అమ్మేశారు.
అంతే కాకుండా గత ఏడాది నంబర్ 1న కొంత మంది వచ్చి ప్రమోద్ లీజుకున్న స్థలంలో సెక్యూరిటీని తరిమివేసి గొడవ చేశారు. దీంతో ప్రమోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవటంతో ఆయన ప్రైవేటుగా నాంపల్లి కోర్టులో కేసు వేశారు. కేసుని పరిశీలించిన కోర్టు సురేష్ బాబు, రానాలపై కేసు నమోదు చేయాలని పోలీస్ వారికి సూచనలు చేసింది.