China vs America : అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను టెక్ ప్రపంచంలో ప్రవేశపెట్టడం వల్ల టెక్నాలజీ రూపురేఖలే ఒక్కసారిగా మారిపోయాయి. దీనిని ఉపయోగించుకొని అమెరికా.. టెక్నాలజీ విషయంలో ఇతర దేశాలకు అందనంత దూరం వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికా.. చైనానే టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.
ఇప్పటివరకు టెక్నాలజీలోని టాప్ సంస్థలకు మాత్రమే సొంతమైన కొన్ని ప్రక్రియలు, పరికరాలు.. ఏఐ సక్సెస్తో అమెరికా దగ్గరకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా 2020లోనే నేషనల్ ఏఐ ఇనిషియేటివ్ యాక్ట్.. ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. 18 నెలలు కష్టపడి ఒక నేషనల్ ఏఐ రీసెర్చ్ రీసౌర్స్ (నైర్ర్)ను ఏర్పాటు చేయడానికి ఈ టాస్క్ ఫోర్స్.. ఒక ప్రణాళికను సిద్ధం చేసి పెట్టింది.
నైర్ర్ అనేది కృత్రిమ మేధస్సు గురించి పరిశోధనలు చేయాలనుకునే పరిశోధకులకు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలకు మాత్రమే ఇది సాధ్యపడుతోంది. పూర్తిస్థాయిలో మానవు మేధస్సును.. కృత్రిమ మేధస్సు కోసం ఉపయోగించడమే ఈ నైర్ర్ ముఖ్య లక్ష్యం. దీని ద్వారా ఏఐను టెక్నాలజీకి భవిష్యత్తుగా మార్చి.. సొసైటీకి ఉపయోగపడేలా చేయాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.
నైర్ర్ అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలంటే.. 2.6 బిలియన్ డాలర్ల బడ్జెట్తో ఆరేళ్ల పక్కా ప్రణాళిక అవసరమవుతుందని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. చైనాతో పోటీపడడానికి అమెరికా ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఏ మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. ఇక తాజాగా చాట్ జీపీటీ ఇచ్చిన ఊపుతో అమెరికాలో టెక్ వరల్డ్లో పరిశోధనలు మరింత ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక ఏఐకు సంబంధించిన అన్ని ముఖ్య పరిశోధనల్లో నైర్ర్ ముఖ్య పాత్ర పోషించనుంది.