Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్లు, ఫ్లాపులతో సంబంధంలేకుండా సినిమాలు చేస్తోంది. అటు రెమ్యునరేషన్ కూడా భారీగానే పొందుతోంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వరుస సినిమాలతో చేతినిండా సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. దేశంలోని ఐదు ప్రముఖ నగరాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట. హైదరాబాద్, కూర్గ్, గోవా, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ అమ్మడుకి ఖరీదైన అపార్ట్మెంట్లు ఉన్నాయట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఇక ఈ వార్తలపై స్పందించిన రష్మిక అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. తనపై తప్పుడు వార్తలను ఎవరు సృస్టిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇవన్నీ నిజమైతే బాగుండని తెలిపింది.