Kiara-Sidharth: బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలు ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈనెల 7న రాజస్థాన్లోని జైసల్మేర్లో వారి వివాహం వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పెళ్లి తర్వాత మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టిన కియారా అద్వానీకి ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ.. బ్యాండు మేళాలతో స్వాగతం పలకగా.. సిద్దార్థ్, కియారా చిందులేశారు.
ఇక సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల కోసం ఈ జంట ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసింది. ముంబైలోని ఓ స్టార్ హాటల్లో ఈనెల 12న రిసెప్షన్ జరగనుందట. ఇప్పటికే రెసెప్షన్ ఏర్పాట్ల కోసం ఈ జంట ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిందట. ఈ వేడుకకు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, మనీశ్ మల్హోత్రా, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, జుహీ చావ్లాత, అనిల్ కుపూర్, రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రాతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.