IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయి 223 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 120, అక్షర్ పటేల్ 84, రవీంద్ర జడేజా 70, షమీ 37 పరుగులతో రాణించారు.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా (70) ఔట్ అయ్యాడు. అయినప్పటికీ అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. లాస్ట్లో 84 పరుగుల వద్ద చివరి వికెట్గా ఔటయ్యాడు. దీంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ మర్ఫి అదరగొట్టాడు. మొత్తం 47 ఓవర్లు వేసిన మర్ఫి… 124 రన్స్ ఇచ్చాడు. అదే సమయంలో ఏడు వికెట్లు తీశాడు. ఇక మిగిలిన మూడు వికెట్లలో రెండు లియాన్ తీయగా.. కమ్మిన్స్ ఒకటి తీశాడు.