Narendra Modi: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తున్నా.. ముగింపు మాత్రం కనబడడం లేదు. పైగా రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఇప్పటికే వేలాది మంది అమాయకపు ప్రజలతో పాటు ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్థినష్టం సంభవించింది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇప్పటికే పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే యుద్ధం ఆపడం ప్రధాని మోదీ చేతిలోనే ఉందని అమెరికా శ్వేతసౌధం వెల్లడించింది.
యుద్ధం ముగింపు విషయంలో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించగలరని శ్వేతసౌధ ప్రతినిధి జాన్ కెర్బీ అన్నారు. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన పుతిన్.. ఆ దురాక్రమణను మోదీ చెబితే ఇప్పటికిప్పుడు ఆపగలరని తెలిపారు. రోజరోజుకు పుతిన్ మిస్సైల్లతో దాడులు చేసి అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి.. ఉక్రెనియన్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు.