Telangana Secretariat: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో సచివాలయంను నిర్మిస్తున్నారు. తాజాగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న, ఇప్పటికే ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు కలిపి మొత్తం 13, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.