Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. 2005లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడగుపెట్టారు. నేటితో వారిద్దరు ఒక్కటై సరిగ్గా 18 ఏళ్లు. ఈ సందర్భంగా ఒకరికొకరు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ.. శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
మహేష్ బాబు సింపుల్గా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘మనం ఒక్కటై 18 ఏళ్లు అవుతోంది. మరెన్నో ఏళ్లుపాటు మనం ఇలాగే కలిసి జీవించాలి. పెళ్లి రోజు శుభాకాంక్షలు నమ్రతా శిరోద్కర్ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు నమ్రత.. మహేష్కు బలవంతంగా ముందుపెడుతున్న రొమాంటిక్ ఫొటోను షేర్ చేస్తూ..‘‘ఐ లవ్ యూ’’ అంటా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. ఆ సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడి.. అదికాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులు డేటింగ్లో ఉండి 2005లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వారికి గౌతమ్, సితారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.