Transgender Couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. కేరళకు చెందిన ట్రాన్స్జెండర్స్ జంట జహద్, జియాపావల్లు కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం జియా కేరళలోని కోయిక్కోడ్ మెడికల్ కాలేజీలో పండంటిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జహద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అయితే పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డకు పాలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మిల్క్ బ్యాంక్ నుంచి బ్రెస్ట్ మిల్క్ను పట్టిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.
కేరళకు చెందిన ట్రాన్స్జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.