Elon Musk:కొన్నాళ్ల క్రితం వరకు స్పేస్ టెక్నాలజీ, పరిశోధనల్లో కేవలం ప్రభుత్వ రంగాలు మాత్రమే పాల్గొనేవి. కానీ ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ కూడా కమర్షియల్గా మారిపోయింది. అందుకే ఎన్నో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలోకి తమ శాటిలైట్లను పంపుతున్నాయి. అలాంటి ఒక సంస్థే స్పేస్ ఎక్స్. ఎలన్ మస్క్ స్థాపించిన ఈ స్పేస్ ఎక్స్ త్వరలోనే ఓ భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఈ ఏడాది మార్చ్లో ఎలన్ మాస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ నుండి ఒక స్టార్ షిప్ రాకెట్ లాంచ్ జరగనుంది. తాజాగా ఎలన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్నితన ట్విటర్లో పేర్కొన్నారు. ఒక యూజర్ తన స్టార్షిప్ అప్డేట్ను అడిగినదానికి సమాధానం మస్క్ ఈ ట్వీట్ చేశారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. వచ్చే నెల ఓ స్టార్షిప్ లాంచ్కు సన్నాహలు చేస్తున్నామని తన ట్వీట్లో చెప్పుకొచ్చారు మస్క్.
స్పేస్ ఎక్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అమెరికా సంస్థలు స్పేస్ పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నాయి. సెరఫిమ్ స్పేస్ అనే సంస్థ త్వరలోనే స్పేస్ పరిశోధనలకు సంబంధించి 12 స్టార్టప్స్కు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అవన్నీ కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం 150 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించనున్నాయి. వాతావరణ మార్పుల నుండి డిఫెన్స్ కమ్యూనికేషన్స్ వరకు అన్ని రంగాలలో ఈ స్టార్టప్స్ పనిచేయనున్నాయి.
అమెరికాను చూసి మరెన్నో దేశాలు కూడా స్పేస్ పరిశోధనలను వేగవంతం చేయనున్నాయి. ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఇప్పటికే బయో హైబ్రిడ్ రోబోను తయారు చేశాయి. చైనా అయితే ఏకంగా చంద్రుడిపై తమ జెండాను పాతాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ప్రభుత్వాలు కూడా స్పేస్ టెక్నాలజీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడడం లేదు.