Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో భారత సంతతికి చెందిన అమ్మాయి చోటు దక్కించుకుంది. సెంటర్ ఫర్ టాలెంటెడ్(సీటీఐ) యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఇండోఅమెరికన్ నటాషా పెరియనాయగమ్ పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబర్చింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన, వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన విద్యార్థులను వెలికితీసేందుకు ప్రతిఏటా సీటీఐ పలు పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అందులో కేవలం 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించగా.. అందులో నటాషా మొదటి స్థానంలో నలిచి రికార్డ్ సృష్టించింది.
నటాషా న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్లో చదువుతోంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగరిత్యా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిపోయారు. తాజాగా నిర్వహించిన పోటీల్లో నటాషా పాల్గొని స్కాలాస్టిక్ ఆప్టిట్యూట్ టెస్ట్, ఏటీసీ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ స్కోర్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.