Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ మధ్యకాలంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. శిథిలాల కింద చిక్కుకొని వేలాది మంది దుర్మరణం చెందగా.. మరికొందరు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియన్ అట్సు ప్రాణాలతో భయపట్టాడు. భూకంపం సంభవించిన సమయంలో క్రిస్టియన్ సదరన్ ప్రావిన్స్ ఆఫ్ హటే ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్నాడు. సహాయక సిబ్బంది అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం క్రిస్టియన్ అట్సు టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో చెల్సియా ఫుట్ బాల్ క్లబ్కు కూడా ప్రాతినిధ్యం వహించారు.