Siva Deeksha:అయ్యప్పమాల, భవానీ దీక్షని తీసుకున్నట్టే, నియమాలతో శివదీక్షని కూడా ఆచరిస్తారు . మాఘమాస్యంలో మొదలై మహశివరాత్రి వరకు 41 రోజుల పాటు శివమాస ధరిస్తారు.ప్రతి యేట శివరాత్రి ముందు శివుడి మలధారణ చేసి, శివరాత్రి నాడు లింగొధ్బవ సమయంలో మాల విరమణ చేస్తారు. శివ దీక్షతో లయకారకుడైనా శివుడిని రూపం ధరిస్తే మోక్షం కల్గుతుందని భక్తుల నమ్మకం.
శివదీక్ష చేస్తున్నవాళ్లు ప్రతి రోజు సూర్యోదయం, మధ్యహ్నం, సాయంత్రం ఇలా ప్రతి రోజు కఠిన నియామాలతో శివుడిని పూజిస్తు. కఠిక నేలపై నిద్రిస్తారు.శివ దీక్షలు మహమండలం 108 రోజు, మండల దీక్ష 41 రోజులు, అర్థమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు..శివమాల ధరించే స్వాములు కఠిన నియమాలు పాటిస్తారు. తప్పని సరిగా శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే లింగం ధరించిన స్వాములు మాలలు వేస్తారు. చందన రంగు వస్త్రాలను ధరించి, నుదుట విభూతి పెట్టుకుని, కుంకుమ చందనం, మెడలో రుద్రాక్ష మాల ధరిస్తారు.
దీక్ష సమయంలో మౌనవ్రతులై ఉండాలి. అవసరమైనంతవరకే అంటే మితంగా మాట్లాడాలి . నిత్యం, అనుక్షణం శివభక్తిని వీడకూడదు.ఇతరులను పిలిచినప్పుడు అయ్యప్ప భక్తులు “స్వామి “అన్నట్లు “శివ” భక్తులు కూడా “శివ” అని పిలుస్తుండాలి. శివపంచాక్షరీ” ఓం నమశ్శివాయ అని జపము చేసుకుంటూ ఉండాలి. ఒక బీజాన్ని మట్టిలో నాటినట్టు, మనసులో ఈ పంచాక్షరీ మంత్రాన్ని నాటుకోవాలి .
శ్రీరామచంద్రుడు శ్రీరామలింగేశ్వరుని, శ్రీకృష్ణుడు శివదీక్షను, అర్జునుడు పాశువత దివ్య దీక్షను స్వీకరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. మనకు తెలిసినంత వరకు శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప నుండీ, పర్వతుడు శివదీక్షను పాటించినట్లు విక్రమాదిత్యుని తామ్రశాసనం చెబుతోంది