Victoria Gowri: న్యాయవాది విక్టోరియా గౌరిని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియమించడంపై వివాదం తలెత్తింది. గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధానకార్యదర్శిగా పనిచేసిన గౌరి.. ఆ సమయంలో ముస్లింలు, క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయంపై పలువురు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖలు రాశారు. గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రిట్ పిటిషన్పై దర్యాప్తు జరుపుతామని సీజేఐ స్పష్టం చేశారు. నిజానికి దీనిపై విచారణను వచ్చే వారంకు లిస్టింగ్కు పెట్టాలని సీజేఐ భావించారు. అయితే అత్యవసరంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ సుప్రీం కోర్టును కోరారు. దీంతో వచ్చే శుక్రవారం ఈ వ్యవహారంపై విచారణ చేపడుతామని సీజేఐ వెల్లడించారు.