Vanijayaram : ప్రముఖ గాయని వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. భారీ తరలివచ్చి అభిమానులు మధురగాయనికి తుది వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చెన్నైలోని బేసంట్ నగర్ శ్మశాన వాటికలో వాణీజయరాం అంత్యక్రియలు నిర్వహించింది.
అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాణీజయరాం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతిపై సీఎం సంతాపం తెలిపారు. వాణీజయరాం మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఆమెకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అవార్డు అందుకోకుండానే వాణీజయరాం మరణించడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
శనివారం చెన్నైలోని వాణీజయరాం నివాసంలోనే అనుమానాస్పదంగా మృతిచెందారు. పోస్టుమార్ట్ం రిపోర్టులో ఆమె ముఖపై బలమైన గాయాలు అయినట్లు తేలింది. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీజయరాం భర్త జయరామ్ ఐదేళ్ల క్రితం మృతిచెందారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. బంధువులే వాణీ జయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాణీజయరాం దేశవ్యాప్తంగా 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలను వాణీజయరాం పాడారు.