Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. ముషారఫ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన 2016 నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. ముషారఫ్ మరణం పట్ల పలువురు దేశాధినేతలు సంతాపం తెలియజేస్తున్నారు.
1943లో ఢిల్లీలో జన్మించిన ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేశారు. ఆతర్వాత 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పదవి దక్కించుకున్నారు. కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారకుడు ఆయనే. 2001లో పాకిస్థాన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్..2008 వరకు ఆ పదవిలో కొనసాగారు.