Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. అటు వైసీపీ కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఈక్రమంలో టీడీపీకి మద్ధతుగా ఓ వైసీపీ నేత రిలీజ్ చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి విమానంలో హైదరాబాద్కు వెళ్తూ పక్కసీట్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ‘‘చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రజలందరూ రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారు. నేను వైసీపీ నేతను అయినప్పటికీ.. అమరావతిని రాజధానిని చేయడం చంద్రబాబు వల్లే సాధ్యం అవుతుంది. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో సేవ చేశారు.. ఆయనలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.