Chinese billionaires: చైనా కుబేరులు విదేశాల బాట పడుతున్నారు. వ్యాపారాల్లో కూడబెట్టిన సంపాదనంతూ మూటకట్టుకొని సింగపూర్కు చెక్కేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉన్న సంపన్నుల్లో దాదాపు 10 శాతం మంది సింగపూర్కు మాకాం మార్చేశారు.
చైనా ప్రభుత్వం కొంతకాలంగా దిగ్గజ వ్యాపారవేత్తలు, కుబేరులు, టెక్ బిలియనీర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్మా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాట జారినందుకు అక్కడి ప్రభుత్వం అతనిపై కక్ష్య కట్టింది. దీంతో ఆయన సంపాదనంతా కోల్పోయి… చివరికి జపాన్లో తలదాచుకుంటున్నాడు.
అయితే జాక్మా పరిస్థితే భవిష్యత్తులో తమకెందుకు రాదని సంపన్నులు ఆందోళన చెందుతన్నారు. ఈక్రమంలో వారంతా సింగపూర్కు పమయనమవుతున్నారు. సింగపూర్లో ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే పన్నుల శాతం కూడా చాల తక్కువ. అంతేకాకుండా సింగపూర్లో చైనా నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా నివసిస్తుంటారు. ఈక్రమంలో సింగపూర్కు పమయనమవ్వడానికి చైనా కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.
సింగపూర్కు వెళ్లడం వల్ల ఇప్పటి వరకు సంపాదించిన సొమ్మను కాపాడుకోవడంతో పాటు.. రాబోయే తరాల వారికి అందించవచ్చని సంపన్నులు భావిస్తున్నారట. అందుకే సింగపూర్కు వెళ్తున్న చైనా సంపన్నుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.