USA: భారత్లో తయారైన దగ్గుమందు కారణంగా జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. భారత్లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అగ్రరాజ్యం అమెరికాలో కొందరు కంటిచూపు కోల్పోవడమేగాక.. ఓ మరణం కూడా సంభవించింది.
తమిళనాడులోని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చుక్కల మందును తయారు చేసింది. ఈ డ్రాప్స్ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 మంది కంటిచూపును కోల్పోయారు. అలాగే ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అమెరికా ఆ చుక్కల మందుపై ఆంక్షలు విధించింది. వైద్యులు, వినియోగదారులు దానిని ఉపయోగించవద్దని హెచ్చరించింది.
ఈక్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది. చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించింది. యూఎస్కు పంపించిన బ్యాచ్లకు చెందిన నమూనాలను .. దాని తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలను అధికారులు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు.