EPAPER
Kirrak Couples Episode 1

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. భారత్‌లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అగ్రరాజ్యం అమెరికాలో కొందరు కంటిచూపు కోల్పోవడమేగాక.. ఓ మరణం కూడా సంభవించింది.


తమిళనాడులోని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చుక్కల మందును తయారు చేసింది. ఈ డ్రాప్స్‌ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 మంది కంటిచూపును కోల్పోయారు. అలాగే ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అమెరికా ఆ చుక్కల మందుపై ఆంక్షలు విధించింది. వైద్యులు, వినియోగదారులు దానిని ఉపయోగించవద్దని హెచ్చరించింది.

ఈక్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది. చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించింది. యూఎస్‌కు పంపించిన బ్యాచ్‌లకు చెందిన నమూనాలను .. దాని తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలను అధికారులు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు.


Tags

Related News

New Zealand: న్యూజిలాండ్‌ను వీడుతున్న ప్రజలు.. అదోగతిలో అందాల దీవి, అసలు ఏమైంది?

Turkish Influencer suicide: తనను తానే పెళ్లి చేసుకున్న తుర్కిష్ ఇన్ఫ్లు యెన్సర్ ఆత్మహత్య

Israel Bomb Hezbollah: దారుణమైన చావు.. హిజ్బుల్లా చీఫ్ హత్యకు 900 కేజీ అమెరికా బాంబు ఉపయోగించిన ఇజ్రాయెల్..

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

Lebanon Beirut : బేరుట్‌లో కూలిపోయిన ఇళ్లు.. బాంబుల భయంతో రోడ్లపై నిద్రిస్తున్న వేలాది ప్రజలు..

Jaishankar at UNGA: పాకిస్తాన్ కు ఇచ్చి పడేసిన ఇండియా.‌. అందరి ముందు పరువు పోయిందిగా!

Mehbooba Mufti: హెజ్బుల్లా చీఫ్ హత్యకు వ్యతిరేకంగా మెహ్‌బూబా ముఫ్తీ నిరసన.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

Big Stories

×