Supreme Court: ప్రధాని నరేంద్రమోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల ఆధారంగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.
అయితే కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడం, దానికి సంబంధించిన లింకులను భారత్లో బ్లాక్ చేయడాన్ని నిషేధిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు అది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.
ఆ పిటీషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది.