UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది 1105 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకోనుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభం కాగా.. 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు… డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ప్రిలిమ్స్ మే 28న జరగనుండగా… పరీక్షకు కొద్దిరోజుల ముందు అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.