Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 172.56 పాయింట్ల లాభంతో 59,879 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.1 పాయింట్లు లాభపడి 17,643 వద్ద ట్రేడవుతోంది.
విప్రో, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్, టైటాన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో… ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, యాక్సిక్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.