Sagar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఉదయం 6.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. సాగర్ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ 1983లో నరేష్-విజయశాంతి జంటగా వచ్చిన ‘రాకాసిలోయ’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘అమ్మదొంగా’, ‘భానుచందర్’, ‘స్టూవర్ట్పురం దొంగలు’, ‘అమ్మనా కోడలా’, ‘రామసక్కనోడు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘రామసక్కనోడు’ చిత్రానికి మూడు నంది పురస్కారాలు కూడా లభించాయి.