Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి రానా సనావుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్లను సృష్టించి పాక్ తప్పుచేసిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ‘‘మనం ముజాహిదీన్లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’’ అని పేర్కొన్నారు.
ఉగ్రదాడులతో పాకిస్థాన్ సతమతమవుతోందని అన్నారు. ఈ దాడులతో పాక్ పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని తెలిపారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్కు ఇప్పటి వరకు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఇక పెషావర్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్లో నిరసన తెలిపారు.