Budget: బడ్జెట్లోని పలు అంశాలు లీక్ కావడంతో ఆర్థిక మంత్రి పదవి వీడాల్సి వచ్చింది. ఈ ఘటన 1950లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగింది. బడ్జెట్లోని కొన్ని అంశాలు ముందే బయటకు తెలిసిపోయాయి. దీంతో అప్పటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన కొంత మంది ఉన్నత వర్గాలకు కొమ్ముకాసి బడ్జెట్ను లీక్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈక్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జాన్ మథాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి వరకు బడ్జెట్ను రాష్ట్రపతి భవన్లోనే ముద్రించే వారు. ఈ ఘటనతో బడ్జెట్ ముద్రణను రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్డులోని ముద్రణాలయానికి మార్చారు.
ఆ తర్వాత 1980లో నార్ట్బ్లాక్లో ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా బడ్జెట్ ప్రతులను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.