Intel: మాంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు దివాళా తీస్తున్నాయి. ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించకుండా.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది.
కంపెనీ సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఇంటెల్ వెల్లడించింది. దీంతో సీఈవో జీతంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల జీతాల్లో 15 శాతం, సీనియర్ మేనేజర్ల జీతాల్లో 10 శాతం కోత పడనుంది.
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించామని.. కంపెనీ భవిష్యత్తు నిర్ణయాలకు ఇది ఎంతో దోహద పడుతుందని ఇంటెల్ వెల్లడించింది.