Budget 2023: కేంద్ర బడ్జెట్ అనగానే అన్నివర్గాలకు ఎక్కడలేని ఆశ. పన్నులు, ధరలు పెరిగేవి-తగ్గేవి ఏంటనే దానిపై ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రాష్ట్రాలు మాత్రం తమకేమైనా నిధుల ఇచ్చారా? అని చూస్తాయి. కొత్త సంస్థలు ఏవైనా కేటాయించారా? ఉన్నవాటికి కేటాయింపులు చేశారా? అని బడ్జెట్ పీడీఎఫ్ ను తెగ వెతుకుతుంటాయి. లేటెస్ట్ సెంట్రల్ బడ్జెట్ 2023లో తెలుగు రాష్ట్రాల సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి…
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు ఇలా..
~ సింగరేణికి రూ.1,650 కోట్లు
~ ఐఐటీ హైదరాబాద్ కు రూ.300 కోట్లు
~ మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు
ఏపీ సంస్థలకు కేటాయింపులు ఇవే..
~ విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు
~ ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.47 కోట్లు
~ పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు..
~ రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37 కోట్లు
~ మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు
~ సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు కలిపి రూ.357 కోట్లు
మొత్తంగా కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణకు రూ. 21,470 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.