Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 2023 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో సూచీలు జోష్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 336 పాయింట్ల లాభంతో 59,886 వద్ద.. నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 17,765 వద్ద ట్రేడవుతోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఐటీసీ, ఎంఅండ్ఎం, ఇండస్బ్యాంక్ సన్ఫార్మా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.