Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కన్యాకుమారిలో ప్రారంభమై ఈ యాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్లో ముగియనుంది. సోమవారం శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభతో రాహుత్ గాంధీ యాత్రను ముగిస్తారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ శ్రీనగర్లోని చారిత్రక లాల్ చౌక్లో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి అన్ని విపక్షాలను కాంగ్రెస్ ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం పంపించింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఆ పార్టీల నుంచి నేతలు సభకు హాజరు అవుతారా? లేదా అనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.