Pakistan: ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అతలాకుతలమవుతోంది. తినడానికి తిండి లేక జనాలు అల్లాడిపోతున్నారు. గతేడాది సంభవించిన వరదల కారణంగా సంక్షోభం మరింత తీవ్రతరమైంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
ఈక్రమంలో పాక్కు మరో చిక్కొచ్చి పడింది. కరాచీలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. గడిచిన 15 రోజుల్లో ఈ వ్యాధి భారిన పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
వైద్యుల బృందం వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతానికి చేరుకొని పరిశోధనలు చేస్తోంది. వ్యాధి సోకిన వారిలో తీవ్ర జ్వరం, దగ్గు, గొంతు వాపుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను గుర్తించారు.