Petroleum Engineering:పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనలు దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వీటి ధరలు ఓవైపు ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా దేశంలో పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో మరింత మార్పు రావాలని పలువురు పరిశోధకులు కోరుకుంటున్నారు. వాటి దిశగా పలు ఐటి సంస్థల అడుగులు పడుతున్నాయి.
ఐటి సంస్థ అయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్.. ధన్బాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పెట్రోలియం ఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్ విభాగాల్లో పరిశోధనలు చేయడానికి ఒప్పందం కుదిరించుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్తో కలిసి ఓ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా హెచ్సీఎల్ తయారు చేయనున్నట్టు సమాచారం.
ఒప్పందం ప్రకారం ఐఐటీ విద్యార్థులు పరిశోధనలు చేయడం కోసం వారికి తగిన ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్ను హెచ్సీఎల్ అందించనుంది. డ్రిల్లింగ్, హైడ్రోకార్బన్స్ ప్రొడక్షన్ విభాగంలో పరిశోధనలు చేసి కార్బన్ ఫూట్ప్రింట్కు ఓ పరిష్కారాన్ని అందించడం కోసం వారు పనిచేయనున్నారు.
ఈ క్రమంలో ఆయిల్, గ్యాస్ సెక్టార్కు సంబంధించి కూడా పరిశోధనలు చేయనున్నారు. అందులో భాగంగానే పలు కార్యక్రమాలను నిర్వహించి అందరి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ప్రజెంటేషన్స్, డిస్కషన్స్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఐఐటితో చేసుకున్న ఈ ఒప్పందంలో కార్బన్ శాతాన్ని స్థిరంగా ఉంచడానికి హెచ్సీఎల్ ఉద్యోగులకు సహాయం చేకూరనుంది