Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో ఓ మామ 70 ఏళ్ల వయస్సులో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని గోరఖ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛపియా ఉమ్రాన్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్(70) అనే వ్యక్తి భార్య 12 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అతని నలుగురు పిల్లలు కూడా పెళ్లి చేసుకొని వేరే కాపురాలు పెట్టారు. దీంతో కొద్దిరోజులుగా కైలాశ్ యాదవ్ ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఇటీవల అతని మూడో కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని భార్య పూజను కైలాశ్ యాద్ పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజ మెడలో మూడుముడులు వేశాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.