Sun Temple in Secunderabad:సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపుతాడు. సాయంకాలం విష్ణురూపంగా వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. సౌరమానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి.
అరుదుగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి మన సికింద్రాబాద్ లో ఉంది. తిరుమలగిరిలో ప్రకృతి అందాల మధ్య విశాలమైన ఆహ్లాదకర వాతావరణంలో ఆలయం ఉంది. సూర్య శరణ్ దాస్ మహరాజ్ అనే భక్తుడికి సూర్య భగవనాడు స్వయంభువుగా దర్శనమిచ్చి తన దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. స్వామి ఆదేశాల ప్రకారం 1959లో ఈ ఆలయాన్ని నిర్మించారు.
రథసప్తమి రోజు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. 12 ఆదివారాల పాటు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికల నెరవేరుతాయని నమ్మకం. ఈగుడిలో మరగత గణపతి, శివాలయం సరస్వతి ఆలయం నాగదేవతాలయం కూడా ఉన్నారు.