Sharwanand : హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతున్నాడు. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షితారెడ్డి అనే యువతితో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా ఈ జంట నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకను ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో హైదరాబాద్లోని ఓ హోటల్లో అట్టహాసంగా నిర్వహించారు.
రక్షితా రెడ్డి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలుస్తోంది. అలాగే ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలి అని సమాచారం.
శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ రామ్చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యాడు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు.అలాగే శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు.
శర్వానంద్ నటించి ‘ఒకే ఒక జీవితం’ మూవీ ఇటీవల విడుదలై విజయం సాధించింది. ఆ తర్వాత శర్వానంద్ కొత్త ప్రాజెక్ట్లు ఒప్పుకోలేదు. పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతోనే సినిమాలకు కొంత విరామం ప్రకటించాడు. పెళ్లి, హనీమూన్ టూర్ పూర్తైన తర్వాత కొత్త ప్రాజెక్టులు చేయాలనే యోచనలో ఉన్నాడు.