Pakistan: దయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోయిన ఏడాది వచ్చిన వరదల కారణంగా పాక్ పరిస్థితి మరింత దిగజారింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ ఆస్తులను వేలానికి పెట్టింది.
ఇక మరోసారి పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోతపెట్టాలని భావిస్తోంది. అలాగే దేశ ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రణాళికలను పరిశీలిస్తోంది. జాతీయ పొదపు కమిటీ కూడా మంత్రిత్వ శాఖల వ్యయాలను 15 శాతం తగ్గించాలని భావిస్తోంది.
అయితే పరిస్థితులు ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే అవకాశం ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వీలైనంత త్వరగా పాక్కు ఆర్థిక సాయం అందించకపోతే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని అన్నారు.