YCP Roja : విమానాశ్రయంలో తనపై జనసేన నేతలు దాడి చేశారని మంత్రి రోజా ప్రకటించారు. తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె మీడియాకు వివరించింది. మరోవైపు పోలీసులు వైకాపా నేతలు కలిసి జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ ఏయిర్పోర్టులో జనసేన నేతలతకు మంత్రి రోజా వేలు చూపిస్తూ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ కళ్యాన్ జనసేన నేతలతో కర్రలు ఇప్పించి దాడి చేయించారని వైకాపా నేతలు అంటున్నారు.
మంత్రి రోజా వేలు చూపించి బెదిరించడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడియోలో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పవన్ కళ్యాన్ను అరెస్టు చేయించే ఉద్దేశ్యంతోనే కేసులు పెట్టినట్లు జనసేన నేతలు అంటున్నారు.