For Cancer Patients:మజ్జిగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. పెరుగు తినని వారు కూడా మజ్జిగ తాగుతూ ఉంటారు. మజ్జిగ సులభంగా జీర్ణం అవ్వడమే కాక ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట తగ్గిస్తుంది.
రక్తహీనత తగ్గించి ఆకలిని నియంత్రిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఎంజైమ్లు ఉంటాయి. అందుకని రోజు మజ్జిగను తాగుతూ ఉండాలి. మజ్జిగలో 90% నీరు ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. ఇతర శీతల పానీయాలు తాగడం కంటే మజ్జిగను తాగడం ఎంతో మంచిది. మజ్జిగ పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇది శరీరానికి, కణజాలానికి పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్ రోగులకు చికిత్స సమయంలో ఆహారంగా మజ్జిగ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్స ఒక వ్యక్తిని బలహీన పరుస్తుంది. దీనితో రోజువారి పనులు చేయలేరు. ఈ పరిస్థితిలో క్యాన్సర్ రోగికి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు వాడే మందుల వల్ల రోగులకు విరోచనాలు వస్తుంటాయి.
అయితే వాళ్లు మజ్జిగ తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వారి జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కీమోథెరపీ రేడియేషన్ వల్ల జ్వరం, వాంతులు, విరోచనాలు అధికంగా అవుతుంటాయి. దీంతో పాటు డిహైడ్రేషన్ బారిన పడతారు. మజ్జిగ వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. చురుకుదనం వస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. అందువల్ల క్యాన్సర్ రోగులు చికిత్స సమయంలో మజ్జిగ తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.