EPAPER

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: ఆ సమావేశానికి రావాలంటూ.. పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం

Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనాలంటూ భారత్, పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు ఆహ్వానం పంపించారు. పొరుగు దేశాలే ప్రధమ ప్రధాన్యం విధానంలో భాగంగా పాక్‌కు ఈ ఆహ్వానం పంపించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.


గోవా వేదికగా మే 4,5 తేదీల్లో ఈ ఎస్‌సీఓ సమావేశం జరగనుంది. పాక్‌తో పాటు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు భారత్ ఆహ్వానం పంపింది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి ఎవరూ భారత్‌లో అడుగుపెట్టలేదు. ఒకవేళ పాక్ ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. పాక్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అవుతుంది.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×